Posts

Showing posts from March, 2022

తత్వశాస్త్రం - ఉపాధ్యాయుడు (Philosophy Teacher)

Image
తత్వశాస్త్రం - ఉపాధ్యాయుడు (Philosophy Teacher) - Perspectives in Education ఉపాధ్యాయులందరు తత్త్వవేత్తలు కానవసరంలేదు. కాని ప్రతి ఉపాధ్యాయునకు విద్యాతత్వం తెలిసి ఉండాలి. విద్యా ప్రక్రియలు అమలు చేయడానికి విద్యాతత్వ అవగాహన ఎంతైనా అవసరం. దేశ సంస్కృతి, మతాలు, సంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలు విద్యపై ప్రభావం చూపుతాయి. విద్యావిలువలు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఉపాధ్యాయుడు కూడా సంఘంలో ఒక వ్యక్తియే. కాబట్టి వీటి ప్రభావానికి అతడు లోనుగాక తప్పదు. గతంలో ఉపాధ్యాయుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో సమానుడు కాని ఈనాడు ఉపాధ్యాయుడు . విద్యార్థికి మార్గదర్శి, స్నేహితుడు, తత్త్వవేత్త, కాలానుగుణంగా అతని స్థానంలో మార్పులు వచ్చాయి.  ఈనాడు ఉపాధ్యాయుడు భావిపౌరులను తీర్చిదిద్దుతున్నాడు. ఆదర్శాలను, విలువలను నేర్పుతున్నాడు. తాత్విక భావంగల ఉపాధ్యాయుడు తీర్చలేని సమస్యలుండవు అంటారు.  తాత్విక జ్ఞానం ఉపాధ్యాయునికి చేసే సహకారం : 1. ఉపాధ్యాయునికి ఒక జీవిత విధానం నివ్వడం.   2. నిర్మాణాత్మకంగా, శాస్త్రీయంగా ఆలోచించగల శక్తినిస్తుంది.. 3. ఉపాధ్యాయునికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. . 4.క్రమశిక్షణ, సమస్యలు తీర్చి...

ఆవాస పాఠశాలలు (Residential Schools)

Image
ఆవాస పాఠశాలలు (Residential Schools) - Perspectives in Education  వీటినే " ఆశ్రమ పాఠశాలలు " అంటున్నారు. తెలంగాణా రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, షెడ్యూల్ తెగల (గిరిజనుల) గురుకుల విద్యాలయాల సంస్థ, బి.సి. గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో SC, ST, BC వర్గాల విద్యాభివృద్ధికై ఇవి నడుపబడుతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు కూడా ప్రత్యేక గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటు చేసి మొదటిదశలో 71 మైనార్టీ గురుకులలు ఏర్పాటుచేసింది. ఉపాధ్యాయుల సాధికారతకు ఉపయోగపడిన విధం : ఉన్నత విద్యార్హతలున్న ఉపాధ్యాయులకు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రదర్శించడానికి వీలు కలిగింది. విద్యార్థులు నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉండడం వల్ల తాము ఆశించిన రీతిలో వారిని తీర్చిదిద్దుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగింది.

బౌద్ధకాలంలో విద్యావిధానం - Education in Buddhist times

Image
బౌద్ధకాలంలో విద్యావిధానం -  Education in Buddhist times - Perspectives in Education "బౌద్ధ విద్యావిధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి, భారతీయ తాత్విక సిద్ధాంతమైన “మోక్షసాధన” ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది.  బౌద్ధవిద్యావిధానంలో ఎలాంటి భేదాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి విద్యలో సమాన ప్రతిపత్తి కల్పించబడింది. నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల మొదలైన ప్రముఖ విద్యాసంస్థలు ఈ కాలంనాటివే. వేదవిద్యాపద్ధతిలాగ ఈ విధానంలో కూడా విద్యార్థిదశ “ప్రబృష్టి" అనే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమంతో 8 సం॥ల వయస్సులో గురువు విద్యార్ధిచేత ఈ కింది మూడు మాటలు అనిపించేవారు.  "బుద్ధం శరణం గచ్ఛామి “ధర్మం శరణం గచ్ఛామి" సంఘం శరణం గచ్ఛామి" ఈ మాటలు వల్లించిన తరవాతనే విద్యార్థి సంఘంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించేవాడు.’  విహారాలు, మఠాలు' బౌద్ధకాలం నాటి విద్యా కేంద్రాలు. ఉపాధ్యాయుడు కావడానికి 10 సం॥ల పాటు సన్యాసిగా ఉండి బోధనావృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి. ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్య తండ్రీకొడుకుల మధ్య ఉండే సంబంధం ఉండేది. విజ్ఞాన సంబంధమైన, ఆధ్యాత్మి...

తత్వశాస్త్రం క్రమశిక్షణ (Philosophy-discipline)

Image
తత్వశాస్త్రం క్రమశిక్షణ (Philosophy-discipline) విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్యపుస్తకాలలాగే తత్త్వశాస్త్ర పునాదులపైనే ఏర్పడుతుంది.  ఈ విషయంలోనూ తాత్వికుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.  ఆదర్శవాదులు ఉపాధ్యాయుని మూర్తిమత్వమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తారు.  ఉపాధ్యాయుని వ్యక్తిత్వ ప్రభావమునకు విద్యార్థిలోనై తనంతటతానే క్రమశిక్షణ అలవరచుకొంటాడు అన్నది వీరి భావన.  శిశువును దండించకున్న అతడు చెడిపోవచ్చు అన్న భావన వీరిది. (spare the rod spoil the child) ప్రకృతివాదులు స్వేచ్ఛాక్రమశిక్షణ (free discipline) కావాలంటారు. విద్యార్థిని దండించడం నిరసిస్తారు. విద్యార్థికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వడంలో ఏకీభవిస్తారు. క్రమశిక్షణ విషయంలో తాత్వికులు భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. తత్వం విద్యావిధానంపై చూపు ప్రభావంలో ఇది ఒకటి.

తత్వశాస్త్రం - బోధనా పద్ధతులు (Philosophy Pedagogy)

Image
తత్వశాస్త్రం - బోధనా పద్ధతులు (Philosophy Pedagogy) - Perspectives in Education బోధనా పద్ధతులు వివిధ తాత్త్వికవాదులు గురుశిష్యుల సంబంధానికిచ్చే ప్రాధాన్యతపై ఆధారపడిఉన్నది.  ఆదర్శవాదులు - (Idealists) ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తారు. అతడు విద్యాబోధనలో సర్వశక్తి సంపన్నుడు, జోక్యం ఎల్లప్పుడు కలిగించుకోవచ్చు. వీరు బోధనలో ఉపన్యాన (Lecture) చర్చా (Discussion) బట్టి అభ్యసన (Rote) లాంటి పద్ధతులను బలపరుస్తారు.  ప్రకృతివాదులు (Naturalists) శిశుకేంద్రీకృత విద్యకు (Child-centered) ప్రాధాన్యత ఇస్తారు. వీరికి వర్తమాన స్వానుభవం ముఖ్యం. పనిచేస్తూ అభ్యసించడం (Leam ing by doing) వీరి అభ్యసన పద్ధతి.  వ్యావహారిక సత్తావాదులు ప్రాజెక్టు పద్ధతి, సమస్యాపరిష్కార ' పద్ధతి (project and problem solving method) ను ప్రోత్సహిస్తారు. తాత్విక దృక్పథం ఆధారంగా బోధనా పద్ధతులు రూపొందుతాయి.

తత్వశాస్త్రం - పాఠ్యపుస్తకాలు (Philosophy Text books)

తత్వశాస్త్రం - పాఠ్యపుస్తకాలు (Philosophy Text books) విద్యా ప్రణాళిక (Curriculum) ననుసరించి పాఠ్యప్రణాళికలు (syllabus) రూపొందించబడినవి. పాఠ్యప్రణాళిక ప్రతి పాఠ్యవిషయ అధ్యయనమును కొన్ని లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశ్యాలు తెలుపుతుంది. పాఠ్యపుస్తకాలు వీటిననుసరించి రూపొందుతాయి. తాత్త్వికులు కొందరు పాఠ్యపుస్తకాలకు మరీ అంత ప్రాధాన్యం ఇవ్వరాదని, విద్యచర్యలు ద్వారా అనుభవాలు గణించేవిధంగా జరగాలని అంటారు. పాఠ్యపుస్తకాల తయారీలోనూ భిన్న అభిప్రాయాలున్నాయి. బత్తాయి రేఖావటానికి పాఠ్యపుస్తకంలో చోటుండాలని ప్రకృతి. వాదులంటారు. విషయాత్మక (objective) తార్కిక వరుసక్రమం ప్రయోజకత్వం ఉండాలని వ్యావహారిక సత్తావాదుల అభిప్రాయం. పాఠ్యపుస్తకాలలో విలువలు, వ్యక్తిత్వం ప్రతిభింబించాలని భావవాదులంటారు. ఏవిఏమైనా ఈ నాటికీ పాఠ్యపుస్తకాల స్థానానికి ఎలాంటి భంగం కలుగలేదు. 

విద్యాధ్యేయాలు - ప్రకార్యాలు (Aims and Process of Education)

విద్యాధ్యేయాలు - ప్రకార్యాలు (Aims and Process of Education) శబ్దశాస్త్రమును అనుసరించి " ఫిలాసఫీ ” అనే పదం ' ఫిలోస్' (philos), 'సోఫియా (sophia) అనే రెండు గ్రీకు పదాల నుండి ఉత్పన్నమైనది.  ' ఫిలోస్ ' అనగా ప్రేమ (love) అని ' సోఫియా ' అంటే జ్ఞానం (wisdom) అని అర్థం.  ఫిలాసఫి అంటే సంపూర్ణార్ధంలో జ్ఞానపిపాస (Love of wisdom) అని అర్థాన్ని ఇస్తుంది. తత్వశాస్త్రాన్ని దర్శనశాస్త్రం అన్ని కూడ అంటారు. ఇది సృష్టి రహస్యాన్ని, జీవిత పరమావధిని అన్వేషిస్తుంది. తత్వశాస్త్ర పరమలక్ష్యం సత్యదర్శనం. భారతీయ తత్వశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి. అవి : 1. ఆస్తికవాదం - దేవుని ఉనికిని అంగీకరిస్తుంది. 2. నాస్తిక వాదం - దేవుని ఉనికిని అంగీకరించదు. ఆస్థికవాదంలో ఆరు విభాగాలున్నాయి. ఇవి వేద ప్రామాణీకాలు వీటిని " షడ్జర్శనాలు ”అని కూడా అంటారు. అవి : 1. మీమాంస - కర్మకాండను ప్రతిపాదించేవి 2. వేదాంత - జ్ఞానకాండను ప్రతిపాదించేవి 3. సాంఖ్య 4. యోగ 5. న్యాయ 6. వైశేషకాలు నాస్థికవాదంలో చార్వాక, జైన, బౌద్ధ, తాత్విక వాదనలు ముఖ్యమైనవి. తత్వశాస్త్రం - ప్రధాన విభాగాలు తత్వశాస్త్రంలో...

స్వాతంత్య్రానంతర కమిటీలు, కమీషన్లు - Post-Independence Committees, Commissions

స్వాతంత్య్రానంతర కమిటీలు, కమీషన్లు - Post-Independence Committees, Commissions 1. రాధాకృష్ణన్ కమీషన్ (1948–49) 2. మొదలియార్ కమీషన్ (1952-53) 3. కొఠారి కమీషన్ (1964-66) 4. స్త్రీవిద్యపై జాతీయ కమిటీ (1957-59) 5. జాతీయ విద్యా విధానం (1968) 6. జాతీయ నూతన విద్యా విధానం (1986) 7. రామ్మూర్తి సమీక్ష సంఘం (1990) 8. CABE కమిటీ - జనార్ధన రెడ్డి కమిటీ (1992) 9. జాతీయ సలహా కమిటీ (యక్పాల్ కమిటీ) (1992)

విద్యాభివృద్ధి - వివిధ కమిటీలు, కమీషన్లు - Educational Development - Various Committees, Commissions

విద్యాభివృద్ధి - వివిధ కమిటీలు, కమీషన్లు - Educational Development - Various Committees, Commissions భారతదేశంలోని జాతీయ విధానంలో సార్వత్రిక ప్రాథమిక విద్య ఎప్పుడూ ప్రధానభాగంగా ఉద్ధేశించడం జరిగింది. 1882 ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్, గోపాలకృష్ణ గోఖలే (1910-1912) 4 సం॥ల పిల్లలకు సార్వత్రిక ప్రాథమిక విద్యనందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని ఎంత కృషిచేసినా సత్ఫలితాలను సాధించలేకపోయాం. ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రాథమిక విద్యాకార్యక్రమం అతి పరిమితంగానే జరిగింది. 1947లో మన అక్షరాస్యత 14శాతం మాత్రమే. 1944 విద్యాభివృద్ధి ప్రణాళికలలో సార్వత్రిక ప్రాథమిక విద్య 6–14 సం॥ల మధ్య వయస్సులోని అందరికీ 40 సం॥ల వ్యవధిలో అంచలవారీగా కార్యక్రమాలను అందించాలని అన్నారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ నిర్దేశాలను అమలుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వ కమీషన్లు, కమిటీలు. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ (1882-83) 7-8 సం॥ల ప్రాథమిక విద్యను రెండు ఉపదశలుగా విభజించింది. 1-5 సం॥లు మొదటి దశగా, తరవాత 6-8 సం॥లను రెండో దశగాను విభజించడం జరిగింది. 1947లో స్వాతంత్య్రానంతరం 6-14 సంవత్సరాల పిల్లలకు పాఠశాలల్లో సార్...

రాజ్యాంగ సదుపాయాలు (Constitutional provisions)

రాజ్యాంగ సదుపాయాలు (Constitutional provisions) భారతదేశం స్వాతంత్య్రానంతరం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందింది. వయోజన ఓటింగ్ హక్కు ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ఏర్పడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉంది. రాజ్యాంగ చట్టంలో పొందుపరచబడిన నిబంధనలచే ఇది పరిరక్షించబడుతున్నది. రాజ్యాంగ చట్టంలో కేవలం పరిపాలనా సంబంధమైన అంశాలేకాకుండా సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడ ప్రస్తావించడం జరిగింది. దేశంలో విద్యాభివృద్ధి లేనిదే రాజ్యాంగ పీఠికలో ఉదహరించబడిన సమానన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైన వాటికి విలువలేదు. విద్యాభివృద్ధి లేనిదే ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రగతి సాధ్యపడదు. నిరక్షరాస్యులుగా ఉన్న కోట్లాది ప్రజలు అట్టడుగు స్థాయిలోనే ఉంటూ ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడవలసి వస్తోంది. అందువల్ల విద్యాభివృద్ధిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. -అందువల్ల రాజ్యాంగంలో విద్యాభివృద్ధికి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగ చట్ట ప్రకారం విద్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ సంబంధించిన అంశం. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభు...

1921 తరవాత కాలంలో ప్రాథమిక విద్య - Primary education after 1921

1921 తరవాత కాలంలో ప్రాథమిక విద్య - Primary education after 1921 1921 సంవత్సరం ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయి. ఈ సంవత్సరంలో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పగించడమైనది. నిర్బంధ ప్రాథమిక విద్యను త్వరితంగా అభివృద్ధి చేయవచ్చుననీ, ఇది ప్రాథమిక విద్య సార్వజనీకరణకు నాంది పలుకుతుందనీ ఆశించడమైనది. కాని ఫలితాలు ఆశించిన వాటికి విరుద్ధంగా ఉండటంవల్ల 1929లో హార్టాగ్ కమిటీని నియమించి పరిస్థితిని అంచనా వేయవలసిందిగా ఆదేశించారు. ఈ కమిటీ స్థానిక సంస్థలు అనుభవం లేనివనీ, ఫలితంగా స్థబ్ధత చోటుచేసుకున్నట్లుగా అంచనా వేశారు. అందువల్ల స్థానిక సందర్శించి తనిఖీని నిర్వహించి విద్యా ప్రగతికి అవసరమయ్యే సౌకర్యాల కోసం అధికారులతో తరచుగా చర్చించేటట్లు తగిన చర్యలు తీసుకొనవలసినదిగా సిఫారసు చేశారు. 1937లో ప్రాంతీయ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఫలితంగా ప్రాంతాలవారీగా నిర్బంధ విద్యకు ప్రణాళికలను సిద్ధం చేశారు. నిధులను సమకూర్చారు. 1937లో వార్థాలో మహాత్మాగాంధీ బేసిక్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. కాని 1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంవల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తి విద్యాప్రగతి కుంటుపడింది. ...

19వ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య - Indigenous elementary education in the 19th century

19వ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య - Indigenous elementary education in the 19th century 17, 18 వ శతాబ్దాల మధ్యకాలంలో స్థిరమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ, హిందూ, మహ్మదీయ విద్యాసంస్థలు పక్కపక్కవే వెలిశాయి. ఇలాంటి వ్యవస్థ 19వ శతాబ్ది ఆరంభంలో "చాలా చురుకుగా పనిచేస్తూ ఉండేది. ఈ కాలంలో రెండురకాలైన ఎలిమెంటరీ పాఠశాలలను వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వ్యక్తులు నిర్వహించేవారు. ఉన్నత కుటుంబీకులకు చెందిన పిల్లలు ఈ పాఠశాలలో చదివేవారు.  పాఠశాల: కరికులమ్ 3R's (Reading, writing, Arithmetic) కు మాత్రమే పరిమితమై ఉండేది. పాఠశాలలను మసీదు, దేవాలయాలలో లేదా పోషకుల ఇండ్లలో గాని, ఉపాధ్యాయుల ఇండ్లలోగాని నిర్వహించేవారు, ముద్రించిన పుస్తకాలు గాని, కాగితాలుగాని వాడలేదు. కాని ఉపాధ్యాయులు విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహించేవారు. ఇరువురి మధ్య వాత్సల్య సంబంధాలు నెలకొని ఉండేవి. పెబ్బ, (పర్యవేక్షత) మానిటోరియల్ పద్ధతి అమలులో ఉండేది. కాలక్రమేణా స్వదేశీ పాఠశాలలు కనుమరుగయ్యాయి.

వేదకాలంలో విద్య - Education in the Vedic Period

వేదకాలంలో విద్య - Education in the Vedic Period వేదకాలంలో విద్య : (క్రీ.పూ. 1400-6000) వేదకాలంలోని ముఖ్యమైన విద్యాలక్ష్యాలు దేశభక్తి, సత్ప్రవర్తన . ప్రాచీన సంస్కృతీ వ్యాప్తి, శారీరక, నైతిక, వైజ్ఞానికపరంగా మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం. వృత్తినైపుణ్యాన్ని పెంపొందించడం మొదలైనవి. గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువులు విద్యాబోధనను కొనసాగించేవారు.  గురువు ఆశ్రమంలో విద్య కొనసాగించడం వల్ల ఈ విద్యను "గురుకుల విద్య" గా పిలిచేవారు. విద్యాబోధనకు బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉండేది.  తత్వశాస్త్రం, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, తర్కశాస్త్రం (లాజిక్), భాష మొదలైనవి ప్రధాన బోధనాంశాలు. బోధన ప్రధానంగా మౌఖికంగా ఉండేది.. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా అభ్యసన జరిగేది.  కంఠస్థం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.  ఒకే కుటుంబంలోని సభ్యులులాగ గురుశిష్యుల సంబంధం ఉండేది.

ఇస్లాం విద్య (Education in Islam)

ఇస్లాం విద్య (Education in Islam) ఇస్లాం మతం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. " బిస్మిల్లా "(4సం॥రాల 4నెలల 4 రోజులు నిండిన వారికి ) అనే ఉత్సవంతో ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది.  ముస్లిం విద్యావిధానంలో “ మక్తాబ్ ”లు ప్రాథమిక పాఠశాలలుగా, మదరసాలు ఉన్నత విద్యాసంస్థలుగా ఉండేవి.  మక్తాబ్ -  ప్రాథమిక పాఠశాల మదరసాలు - ఉన్నత విద్యాసంస్థలు వీరికాలంలో కరికులమ్ గణితం, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలైనవి చేర్చబడినాయి.  ఈ కాలంలో సరైన పరీక్షా విధానం లేదు.  స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు.  ఉపన్యాస, చర్చా పధ్ధతులు బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారు.  విద్య మతపరంగా ఉండటంచేత అది హిందువులను ఎక్కువగా ఆకర్షించలేదు.

19వ శతాబ్దిలో ఎలిమెంటరీ విద్యావ్యవస్థ | Elementary education system in the 19th century

19వ శతాబ్దిలో ఎలిమెంటరీ విద్యావ్యవస్థ | Elementary education system in the 19th century క్రీ.శ 1813 నుంచి ఈస్టిండియా కంపెనీ విద్యా బాధ్యతను స్వీకరించింది.  19వ శతాబ్ది ఆరంభంలో ఎలిమెంటరీ విద్య ప్రధానంగా రెండు కారణాలవల్ల అంతగా అభివృద్ధి చెందలేదు.  ఒకటి అథోముఖ వడపోత సిద్ధాంతంను (Downward filtration theory) అవలంభించడం. దీనిద్వారా విద్యా సౌకర్యాలను పై తరగతివారికి మాత్రమే అందచేయడం.  రెండవది విద్యకు కేటాయించిన నిధులు పూర్తిగా పరిమితం కావడం.  1854 ఉడ్స్ డిస్పాచ్ తిరిగి సామాన్య ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండేటట్లు అనేక తీర్మానాలను చేసింది. ఏదిఏమైనా 19వ శతాబ్ది చివరివరకు ప్రాథమిక విద్య ఎలాంటి ప్రగతి సాధించలేదు. 1902లో లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమీషన్ ను నియమించి విద్యావ్యాప్తికి చొరవ చూపారు.  1901లో సిమ్లాలో విద్యాసదస్సును నిర్వహించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి వరకు ఉన్న విద్యా సమస్యలను చర్చించారు. కాని ఈ కమీషన్ భారతీయులనెవరిని సభ్యులుగా నియమించకుండా భారతీయుల మనోభావాలకు తీవ్ర విఘాతాన్ని కలిగించారు.  1904లో కర్జన్ ఎలిమెంటరీ పాఠశాలల నిర్...

వర్ణాశ్రమ ధర్మాలు | Varnashrama Dharmas

వర్ణాశ్రమ ధర్మాలు | Varnashrama Dharmas విద్యార్థి తన జీవితకాలంలోని వివిధ దశలు, వారు చేయాల్సిన ధర్మాలను గురించి వివరిస్తూ  1) బ్రహ్మచర్యం  2) గృహస్థాశ్రమం  3) వానప్రస్థాశ్రమం  4) సన్యాసం  అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.  బ్రహ్మచర్య దశలో ప్రతి ఒక్కరు గురుముఖంగా ఉండే విద్య, జ్ఞాన సముపార్జన చేయాలి.  గృహస్థాశ్రమం ప్రకారం మంచి విద్యను పొంది, సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధంగా జీవిస్తూ, తన తరవాత మరొకతరాన్ని సమాజానికి అందించడానికి, · వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి. ఇతరులకు కష్టం కలిగించని రీతిలో ఆనందంగా గడపాలి.  వానప్రస్థం ; గృహస్థాశ్రమ ధర్మం అనంతరం ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రశాంత వాతావరణంలో గృహస్థాశ్రమ ధర్మం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి.  సన్యాసం , బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమదశ, వాన ప్రస్థదశల అనంతరం తన జీవిత సార్థకతకు 'మోక్షమే' ప్రధాన కాలప్రమాణం. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ భవబంధాలను విడనాడి మోక్షసాధనకై ధర్మప్రచారం చాలి. అరణ్యాలు / ఆశ్రమాల్లో ఆదర్శజీవితం కొన...

ప్రాచీన కాలపు విద్య | Ancient Education

Image
ప్రాచీన కాలపు విద్య -  Ancient education ప్రాచీన విద్య ముఖ్యంగా హరప్పా నాగరికత, మొహంజొదారో: నాగరికత కాలంలో నాటి ప్రజల ఆరాధ్యదైవం ' పశుపతి '.  ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను పశువిధానం. నుంచి మేలైన, మెరుగైన జీవిత విధానానికి తీసుకువెళ్లాలనే భావన ఆనాడు కూడా వచ్చింది.  మంచి జీవన విధానానికి ఎంతగానో ఉపకరిస్తుందని భావించారు. అందుకే ఆ కాలంలో ప్రణాళికాబద్ధమైన నగరజీవనం, వాస్తు విధానం, శిల్ప, భవన నిర్మాణం మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది.  ఆనాటి విద్యా విధానాన్ని గమనిస్తే దాదాపు అన్ని వర్గాలకు విద్యను అందించినట్లుగా తెలుస్తున్నది.  మంచివిద్య ద్వారా ' మోక్షం ' లేదా ఉజ్వలమైన జీవితం లభిస్తుందని భావించారు. కాని ఇదే సమయంలో వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా వర్ణవ్యవస్థ అంటే నిమ్న వర్ణాలు, అగ్రవర్ణాలు, కులవ్యవస్థకు దారితీసింది.  హిందూ సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు గా వర్గీకరణ జరిగింది. Image: Quora 1) బ్రాహ్మణులు : వేదాలు హిందూమత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహణ, మతఛాందస భావనలు, హిందూమతం గురించి అధ్యయనం చేసేవారు. 2) క్షత్రియుడు: క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే న...

భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యావిధానం చారిత్రాత్మక దృష్టి : (Elementary Education in India - Historical perspective)

భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యావిధానం చారిత్రాత్మక దృష్టి (Elementary Education in India - Historical perspective) భారత ఉపఖండంలో విద్య ప్రాధాన్యత ఎంతగానో ఉంది. సనాతన కాలంనుంచి అంటే చారిత్రక యుగం ఆరంభం నుంచి అంతకుపూర్వం వేదాలు, ఉపనిషత్తులు, ''స్మృతులు. మొదలగువాటి ఆధారంగా విద్యావిధానం అమలులో ఉండేది ప్రాచీన విద్యావిధానం, బోధనా విద్యా విధానాలు చాలావరకు సాంప్రదాయిక పద్ధతుల్లోనే కొనసాగాయి. ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలుగా విభజింప బడినారు. పురాణాలు, రామాయణ, భాగవత, భారత ఇతిహాసాల్లో గురుశుశ్రూషలుచేస్తూ ఆశ్రమ విధానంలో విద్యను అభ్యసించేవారని మనకు తెలుస్తుంది. విద్యాబోధనకు ఒక నియమిత కాలం, అలాగే నియమిత అంశాలు బోధించాలనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవసరం, అవకాశం, సందర్భానుసారంగా బోధించబడేవి. వార్షిక పరీక్షలు అనే భావన కాకుండా ధర్మసూత్రాలు, సత్యం, న్యాయం, సామాజిక ప్రాతిపదికన వ్యక్తి అభిరుచిని బట్టి ఆయా రంగాలలో వారికి తర్ఫీదు ఇచ్చేవారని మనకు తెలుస్తుంది. అంతిమంగా పరీక్షలు నిర్వహణ-పోటీలు, ప్రతిభాపాటవముల ప్రదర్శన, యోధులకు సన్మానం మొదలైనవి జరుపబడినట్లు తెలుస్తుంది...

విద్య - దాని స్వభావం (Nature of Education)

విద్య, దాని స్వభావం (Nature of Education)   భారతీయ, పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలను గమనిస్తే విద్య స్వభావం అనేక అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలను మేళవిస్తుంది. శరీరంలోను, మనస్సులోనూ, ఆత్మలోనూ నిక్షిప్తమైన అత్యున్నత శక్తులను బయటకు తీయుటయే విద్య అని ఒకరంటే "జీవితమే విద్య" అని మరొకరన్నారు.  నాగరిక ప్రపంచంలో విద్య అందరికి అవసరమే. మానవ సామాజిక జీవితం మారుతోంది. దీని నేపథ్యంలో విద్య అర్ధం, స్వభావం కూడ మారుతూ ఉంటుంది.  మానవ పరిణామక్రమంలో విద్య స్వభావం కూడ గతిశీలమైనది. విద్య భావం అపరిమితమైనది. ఇది మానవ చరిత్రలో అతి ప్రాచీనమైనది. 'విద్య గర్భస్థ శిశువు నుంచి మరణించే వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ. మనిషి వివిధ దశల్లో పొందిన విజ్ఞానం, అనుభవం విద్యగా గమనించాలి. విద్య అనేది ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. ఇందులో ఒకస్థాయి అనంతరం “మరోస్థాయిలో ప్రగతిని కొనసాగించేదేకాని ఖండికలుగా ఒక స్థాయిని వదలి మరొక స్థాయి నుంచి ఆరంభించడం సాధ్యంకాదు. విద్యాసంస్థల్లో ఒక పద్ధతి ప్రకారం నిర్వర్తించబడుతుంది. విద్య అనేది వ్యక్తి నుంచి ఆరంభమై వ్యక్తుల సమూహం (society), సమాజంలోని అందరికి ఆవశ్యకమైనదని చెప్...

భారతీయ విద్యా, తత్వవేత్తల అభిప్రాయం (Indian concept of Education)

  విద్య - భారతీయ విద్యా, తత్వవేత్తల అభిప్రాయం (Indian concept of Education)   'విద్' అనగా తెలుసుకొనడం (విద్ అనేది సంస్కృత ధాతువు నుంచి ఆవిర్భవించింది). మొదట తననుతాను తెలుసుకొనడం, అనంతరం దివ్యత్వం గురించి తెలుసుకొనడం ఆత్మనుగూర్చి తెలుసుకొనడం అనే ఉదాత్తమైన భావనల నుంచి ఆవిర్భవించిందే విద్య.  విద్య అపరిమితమైనది.  ఇది వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది, దీనికి పరిధి లేదు. విశ్వ మానవుడిని తయారుచేస్తుంది. విద్య-నిర్వచనాలు "వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య" -  గాంధీజీ "వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య" - ఠాగూర్ “శిశువు అభివృద్ధి, జీవితాంతం కొనసాగే ప్రక్రియ" - జాకీర్ హుస్సేన్  "మానవుని నిస్వార్థ తత్పరునిగా, స్వావలంబకుడిగా తయారు చేయునది విద్య" వేదాలు . “మోక్ష సాధనే విద్య”. ఉపనిషత్తులు “ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య". - శ్రీ శంకరాచార్య "మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటయే విద్య”- స్వామి వి...

విద్య- పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు (Westerm concept of Education)

విద్య- పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు (Westerm concept of Education) విద్య అనే పదం “విద్” అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. 'విద్' అంటే తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అనే వివిధ అర్థాలున్నాయి. కాబట్టి విద్య అంటే వీటన్నింటి సమ్మేళనం వల్ల కలిగే జ్ఞానం అని చెప్పగలం.  విద్యకు సమానార్థం ఉన్న ఆంగ్లపదం "Education- ఎడ్యుకేషన్" లాటిన్ భాషలోని ఎడ్యుకేర్ (ఎడ్యుసిడ్) అనే పదాల నుంచి పుట్టింది.  ఎడ్యుకేషన్లోని 'E' అంటే out of అని 'duco' అంటే వృద్ధిలోకి తీసుకురావటం (To bringup) అనే అర్థం వస్తుంది. దారి చూపటం (To lead forth) అనే భావాన్ని ఇస్తుంది. జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణేకాకుండా పొందిన జ్ఞానాన్ని సరైన రీతిలో జీవనస్థితిగతుల్లో ఆచరించే నైపుణ్యం అని చెప్పవచ్చు, అప్పుడే అది విజ్ఞానమవుతుంది. “తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య" - సోక్రటీస్ "సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్ధ్యాన్ని కలిగించేదే విద్య" - ప్లేటో “దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య" - అరిస్టాటిల్ "మనుషులను సార్ధకులు...

విద్య-పరిమిత, విస్తృత అర్థాలు (Narrow and broader Meaning of education)

విద్య-పరిమిత, విస్తృత అర్థాలు (Narrow and broader Meaning of education) విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది. విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగిఉందని చెప్పవచ్చు.  విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞావంగా లేదా జీవితానుభవాల వల్ల కలిగే జ్ఞాన వికాసంగా నిర్వచించవచ్చు.  ఇలా విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగిఉంది. పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకొనే అంశాలు సంకుచితంగాను, వీటితోపాటు జీవితానుభవాలను జోడించి నేర్చుకొనే జ్ఞానాన్ని విస్తృతంగాను చెప్పవచ్చు. పరిమితార్ధం(Narrow Meaning of Education) పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి. పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని అంశాలు, కార్యక్రమాల ప్రభావాల ఫలితం. క్రమబద్ధమైన విద్యావిధానం కేవలం 3R's (Reading, writing and Arithmetic) కు మాత్రమే పరిమితమై పట్టాలు పొందడానికి ఉపయుక్తమైంది. విద్య యొక్క విస్తృతార్థం(Border Meaning of Education) విస్తృతార్థంలో విద్య అంటే కేవలం 3R's చదవటం (Reading), రాయటం (Writing) లెక్కించటం (Arithmetic) మాత్రమే కాదు, జీవితమే విద్య, ఇది ఒక నిరంతర ప్రక్రియ.  ఇది తల్లి గర్భం నుంచి మృత్యువు (womb to tomb) వరకు సాగ...

విద్య అర్థం, భావన(Means of Education and Concept)

1.0 విద్య అర్థం, భావన(Means of Education and Concept) 'విద్య లేనివాడు వింతపశువు' అన్నాడు ఓ మహాశయుడు. విద్య మానవ సుగుణం. విద్య మానవునికి మూడవ కన్ను వంటిది. మానవ సమాజాలు ఏర్పడ్డ తరువాత వాటి నిర్వహణకు సమాజ సభ్యులందరిని సమాయత్తం చేసి వారిని సమాజ నిర్వహణలో భాగం పంచుకోవడానికై జ్ఞానవంతులుగా మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం సమాజం ఇతర వ్యవస్థలతో పాటు విద్యావ్యవస్థను రూపొందించుకొన్నది.  సమాజంలోని ఇతర వ్యవస్థలైన కుటుంబం, రాజకీయ వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ తదితర వ్యవస్థల నిర్వహణకు సమర్థవంతమైన విద్యావంతులు అవసరం ఉందని ప్రపంచంలోని సమాజాలన్నీ ముక్తకంఠంతో అంగీకరించే విషయం. ఇటువంటి అంశాన్ని ప్రధానంగా ఉపాధ్యాయులు సరైన రీతిలో అవగాహన చేసుకొని తదనుగుణంగా విధులను నిర్వహించవలసి ఉన్నది.  విద్యాభావనను సార్వత్రికంగా అవగాహన చేసుకొని దానికి భారతీయ, పాశ్చాత్య, తాత్విక దృక్పథంతో విద్యాభావన ఎలా వివరించబడిందో తెలుసుకోవాలి. దానితోపాటు విద్య అంతర్భావాలను కూడా గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఆధునిక సమాజంలో విద్య అందరికి అవసరం. విద్య మానవుని ప్రవర్తనను మార్చుతుంది.' విద్య గురించి తత్వవేత్తలు, విద్యావేత్...

విద్య దృక్పథాలు | Perspectives in Education - Index

విషయ సూచిక | విద్య దృక్పథాలు | Perspectives in Education - Index 1) భారతదేశ విద్యావిధానం - సంక్షిప్త చరిత్ర 2) ఉపాధ్యాయుని సాధికారత - వృత్తిపరమైన అభివృద్ధి 3) విద్యలో సమకాలీన అంశాలు  3.1 పర్యావరణం-విద్య 3.2 ప్రజాస్వామ్యం-విద్య 3.3. విద్య - అర్థశాస్త్రం 3.4. జనాభా - విద్య 3.5. సమ్మిళిత విద్య 3.6. విద్య-ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ 3.7. సార్వత్రిక విద్య పథకాలు 4) విద్య-సంబంధిత చట్టాలు 4.1. విద్యాహక్కు చట్టం-2009 4.2. విద్యాహక్కు చట్టం - రాష్ట్ర నిబంధనలు 4.3. సమాచార హక్కు చట్టం-2005 4.4. మానవ హక్కులు-బాలల హక్కులు 5). జాతీయ విద్యా ప్రణాళిక చట్రం-2005 6) Abbreviations

ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాపథకం | Andhra Pradesh Primary Education Programme(APPEP)

ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాపథకం | Andhra Pradesh Primary Education Programme(APPEP) ఈ పథకం కేంద్రప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఓవర్ సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (ODA) వారి ఆర్థిక, విద్యావిషయక సహకారంతో ప్రారంభమైంది. 1984-87లో మొదటిదశగా, 1989-95లో రెండవదశగా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు అందరు ఉపాధ్యాయులకు వర్తింపజేయబడింది. ఈ పథకం ఆశయాలు :- మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం. అభివృద్ధిపరిచిన నమూనాలలో పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టడం. ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల మెరుగుదలకు తోడ్పడడం. సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల సాధించుట ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయడం.  నోట్ : ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైంది.  నోట్ : ప్రాథమిక తరగతులలో గుణాత్మక బోధనకు ఈ పథకం ఆరు సూత్రాలను ప్రతిపాదించింది. అవి కృత్యాధార బోధనను (Activity Based Teaching) ను సులభతరం చేసాయి. అవి:  1) అభ్యసన కృత్యాలు కల్పించడం. 2) అనుభవాల ద్వారా అభ్యసనం చేయడం....

Welcome to Perspectives in Education

 Welcome to Perspectives in Education here you may get free study materials of Perspective in Education for TS TET and TS TRT in Telugu Medium.